16 April, 2026 | 6:27 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటా..

21-06-2025 02:37 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా నేతాజీ తండా వద్ద ఇటీవల గ్రానైట్ లారీ ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పరామర్శించి, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ప్రమాద ఘటనలో  గాయపడ్డ గుగులోతు శంకర్, శ్రీనివాస్, శంకర్ లను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందజేయాలని ఆస్పత్రి వర్గాలను కోరారు. రోడ్డు ప్రమాదానికి కారకులైన వారిపై చట్టపరంగా తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.