calender_icon.png 4 June, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి..

02-06-2025 07:50:58 PM

హుజురాబాద్ ఏసిపి మాధవి 

హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి(ACP Vasamsetty Madhavi) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలత నగరాలుగా అభివృద్ధి చేయుటకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం(Telangana State Formation Day) పురస్కరించుకొని హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్, పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాధవి 2కె రన్ ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ సమిష్టిగా పరిసరాలను పరిశుభ్రతను పాటించాలని సూచించారు. రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. టూ కే రన్ లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ కరుణాకర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, పురపాలక సంఘం మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సాంబరాజుతో పాటు క్రీడాకారులు పట్టణవాసులు, వాకర్స్ పాల్గొన్నారు.