9 May, 2026 | 8:05 PM

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి

09-05-2026 07:03 PM

పాపన్నపేట: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పాపన్నపేట మండల భాజపా నాయకులు కోరారు. శనివారం మండల పరిధిలోని చిత్రియాల చౌరస్తాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బస్సులు ఏర్పాట్లు పూర్తి చేసిందని, పాపన్నపేట మండలం నుంచి మహిళలు, ప్రజలు, యువకులు, మోడీ అభిమానులు మోడీ సభను విజయవంతం చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, ఉపాధ్యక్షులు మల్లేశం, కార్యదర్శులు చక్రపాణి, గూడెం మల్లేశం, సంతోష్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు గౌస్, బీజేవైఎం అధ్యక్షులు జగదీష్, కోశాధికారి చంద్రయ్య, బూత్ అధ్యక్షులు మురళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.