6 May, 2026 | 3:12 PM

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి

06-05-2026 02:22 PM

సుల్తానాబాద్, విజయక్రాంతి: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 10 న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు వస్తున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, యువ మోర్చా , మహిళా యువ మోర్చా సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బిజెపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు అర్జున్ రావు, బిజెపి సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

బుధవారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ  కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన  జరిగింది,  ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంపొందించే అంశాలపై చర్చించారు.ఈ భారీ సభకుమండలంలోని  నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా, మహిళా మోర్చా సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. .ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్ , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..