24-06-2025 06:42:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): సిపిఐ పార్టీ నిర్మల్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్(District Chief Secretary Vilas) అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి మహాసభల విజయవంతంపై చర్చించారు. జులై 6న రెండు రోజులపాటు నిర్వహించే నిర్మల్ మహాసభలకు పార్టీ జాతీయ నాయకులు సిహెచ్ వెంకట్ రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు కే శంకర్ హాజరవుతరన్నారు. ఈ సమావేశంలో జిల్లా సమస్యలతో పాటు కార్మిక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, నజీర్, పద్మకుమారి గంగన్న, శ్రీరామ్ పాల్గొన్నారు.