03-06-2025 05:40:49 PM
వీడియోలతో సాక్ష్యాలు విడుదల చేసిన తిప్పారపు సంపత్..
హుజురాబాద్ (విజయక్రాంతి): ఎస్సై భార్గవ్ దళిత యువకుడు మహేందర్ ను అతి కిరాతకంగా కొట్టిన వీడియోలను టీపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్చార్జ్ తిప్పారపు సంపత్(TPCC SC Department State Incharge Thipparapu Sampath) వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలీసులకు గౌరవం ఉండాలి, భయం కాదు” అంటూ సంపత్ అన్నారు. “భార్గవ్ ప్రవర్తన ఒక నియంతలా ఉందని, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ, దళితుని, బాధ్యతగల అధికారి ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఇలాంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థలో ఉండడం అత్యంత దురదృష్టకరంఅని ఆవేదన వ్యక్తం చేశారు.గత 20 రోజులుగా ఈ ఘటనపై పలుసార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇప్పుడే కాదు,అప్పటినుంచే వీడియోలు, సాక్ష్యాలు అందిస్తున్నాం.ఎస్సై భార్గవ్కు కొట్టే హక్కు ఏ చట్టంలో ఉంది? అతనికి రాజ్యాంగ పట్ల గౌరవమూ లేదు, అవగాహన కూడా లేదు. ఇలాంటి వ్యక్తుల వల్లే పోలీస్ వ్యవస్థ పరువు పోతుంది. ఎస్సై భార్గవ్పై హత్యాయత్నం అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.బాధ్యతాయుతంగా వ్యవహరించని కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవికుమార్లను వెంటనే సస్పెండ్ చేయాలి.పోలీసుల పట్ల గౌరవం ఉన్నందువల్లే దళితులు ఇప్పటివరకు ఉద్యమానికి దిగలేదు. కానీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే, ఉద్యమాలు తప్పవు,అని తిప్పారపు సంపత్ హెచ్చరించారు.