29-06-2025 08:50:04 PM
తెలంగాణ ఉద్యమకారుల మహిళా విభాగం ఉమ్మడి జిల్లా కో కన్వీనర్: కంది గట్ల జయ
గోవిందరావుపేట (విజయక్రాంతి): ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నేడు జిల్లా కేంద్రాల్లో ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతియుత దీక్షలను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల మహిళా విభాగం ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ కందిగట్ల జయ(District Co-Convenor Kandigatla Jaya) పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఉద్యమకారుల మహిళా విభాగం మండలం సమావేశం మండల అధ్యక్షురాలు యాస కళమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉద్యమకారుల మహిళా విభాగం ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ శ్రీమతి కందిగట్ల జయ హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు ఎన్నో వ్యయ ప్రయాసలు, కష్టనష్టములకు ఓర్చుకొని చేసిన అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నామని అన్నారు.
ఎందరో ఉద్యమకారులు ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా నష్టపోవారు ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వము కూడా వీరిని ఆదుకోలేదని పేర్కొన్నారు. రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉద్యమంలో వెనుకడుగు వేయకుండా రాష్ట్రాన్ని సాధించేవరకు పోరాడి సాధించుకుందామని అన్నారు. ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానుఫస్ట్ లో పెట్టిన ప్రకారము ప్రతి ఉద్యమకారులకి నెలకు 25 వేల రూపాయల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు.ఉచిత బస్సు ప్రయాణం హెల్త్ కార్డులు మంజూరి చేస్తామన్నారు. పైన పేర్కొన్న హామీలను విడతల వారీగా అమలు పరచాలని రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కోరడమైనది.
ఉద్యమకారుల హామీలను అమలు పరచాలని 30వ తారీకు జరగబోయే శాంతియుత దీక్షకు మద్దతుగా అందరూ ఉద్యమకారులు ములుగు జిల్లా కేంద్రంలో హాజరు కాగలరని దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశమునకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి సంధ్య, ఉద్యమకారుల రాష్ట్ర మహిళా విభాగం కో కన్వీనర్ యాస పూలమ్మ, జిల్లా అధ్యక్షురాలు బత్తుల రాణి, మండల ఉపాధ్యక్షురాలు యానాల ఉపేంద్ర, కార్యదర్శి సామ సమ్మక్క, కోశాధికారి సామ సరోజిని పిట్టల గీత రేగుల మల్లమ్మ పిట్టల భాగ్యలక్ష్మి నిమ్మల సుహాసిని దేవరపల్లి శకుంతల కొండి సుజాత తుక్కాని సుగుణ, తెలంగాణ ఉద్యమకారుల సీనియర్ నాయకులు పెండెం హేమాద్రి, కొండి రమేష్ హాజరయ్యారు.