calender_icon.png 30 June, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగోజి వాడిలో ప్రధాని మన్ కీ బాత్..

29-06-2025 08:55:40 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామంలో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్(Mann Ki Baat) 123వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వీక్షించారు. సంగోజి వాడి గ్రామంలో 152వ బూతులో ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.