30-05-2025 09:15:42 AM
హైదరాబాద్: నగరంలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station) పరిధిలో దారుణం చోటుచేసుకుంది. యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాాల్పడిన ఓ వ్యక్తి అనంతరం బ్లాక్ మెయిల్ కి దిగాడు. మహేంద్ర వర్ధన్ యువతికి ఫేస్ బుక్(Facebook) ద్వారా పరిచయం అయ్యాడు. 2023లో యువతికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు చూపిస్తూ రూ. 20 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా రూ. కోటి అడగటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బంజారా హిల్స్ పోలీసులు(Banjara Hills Police) కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.