21 April, 2026 | 5:26 PM

Breaking News

గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •  

అడవి శ్రీరాంపూర్ లో గుడుంబా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

10-05-2025 10:06 PM

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి గుడుంబా అక్రమంగా రావాణా చేస్తున్న ఒకరిని ఆరేస్టు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. శనివారం భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలోని దుబ్బపేట గ్రామానికి చెందిన అజ్మీర సనత్ కుమార్ 30 లీటర్ల గుడుంబా అక్రమంగా అడవిశ్రీరాంపూర్ కు రవాణా చేస్తున్నాడని అందిన సమాచారం మేరకు ముత్తారం ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో అడివి శ్రీరాంపూర్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సనత్ కుమార్ ద్విచక్ర వాహనం పై 30 లీటర్ల గుడుంబా తీసుకువస్తుండడంతో గుడుంబా స్వాధీనం చేసుకొని ద్విచక్ర వాహనాన్ని సనత్ కుమార్ ను అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మండలంలో ప్రభుత్వం నిషేధించిన గుణం ఎవరైనా అమ్మిన అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నరేష్ హెచ్చరించారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్స్ అశోక్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.