21 April, 2026 | 3:59 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

సైనికులకు మద్దతుగా భారీ తీరంగా ర్యాలీ

10-05-2025 10:10 PM

పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యే

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తీరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ  గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. శనివారం స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగింది. నాయకులు, విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండా లను చేతబట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.

దీంతో పట్టణ పురవీధుల్లో త్రివర్ణ శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... భారత్ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెంటనే వారి దేశాలకు తిరిగి పంపాలన్నారు. దేశ సరిహద్దులోని గ్రామాల్లో ప్రజలపై పాక్ ఆర్మీ దాడులు చేయడం హేయమైన చర్య అని, పాక్ దాడులకు భారత సైన్యం దీటైన జవాబు ఇచ్చిందన్నారు. ఉగ్ర మూకలను శాశ్వతంగా నిర్మూలించాలని ఆకాంక్షించారు.