అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
08-12-2024 12:40 AM
కామారెడ్డి, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్లారెడ్డి మండలంలో చోటుచే సుకున్నది. ఎస్సై బొజ్జ మహేశ్ కథనం మేరకు.. వెల్లుట్ల గ్రామానికి చెందిన యామ గంగారం(46) కొన్ని రోజుల క్రితం తన కూతురికి పెళ్లి చేసి కొంత స్థలం కొనుగోలు చేశాడు. నెల రోజుల కిందట తన కూతురు ఇంటికి రాగా ఈ నెల 6న ఆమెను అత్తగారి ఇంటి వద్ద వదిలి వచ్చిందేకు గంగారం భార్య వెళ్లింది.
ఈక్రమంలో అప్పుల బాధతో సతమతమవుతున్న గంగారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




