09-02-2026 04:43:41 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని గౌతమ బుద్ధ కళాశాల సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ఇలా ఉన్నాయి. డిష్ వైర్కు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదం జరిగినట్లు సమాచారం. రాగబోయినగూడెం గ్రామానికి చెందిన మంచర్ల ఐలయ్య గా గుర్తించారు. ఆయన అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.