calender_icon.png 9 February, 2026 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

09-02-2026 04:47:47 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అందరు విద్యార్థులు అందంగా ముస్తాబయి తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు విశేషంగా కృషి చేసి సఫలీకృతులయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల మాట్లాడుతూ... సమాజంలో గౌరవాన్ని పెంపొందించేది కేవలం విద్య మాత్రమేనన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ స్వపరిపాలన దినోత్సవం లో జిల్లా పరిపాలనాధికారిగా గండవరం సంకీర్తన, ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా జుని ప్రీతికౌర్, డీఇఓగా షేక్ యాస్మిన్, జెడ్పీ సిఇఓ గా కొత్తపల్లి అశ్విత్, ఎంఇఓ గా జెల్లా ఐశ్వర్య, ఎమ్మార్వోగా సత్తి ధాన్యకౌర్, ప్రధానోపాధ్యాయులుగా రుద్రవరం భవాని, ఉపాధ్యాయులుగా మల్లె అమృత, గాదె శివాని, బందారం లిఖ్విత్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.సుశీల, ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, ఎ.పద్మజ, కోణం శ్రీనివాస్, జి.ఇందిర, ఎ.కవిత, ఎన్.సైదులు, సిహెచ్.ప్రసన్న, జి.శైలజ, జె.మంజుల, సిహెచ్.శంకరయ్య, ఎండి.సాదిక్, ఎం.జానకి, ఎం.సౌమ్య, ఎన్.సరళ, డి.కుసుమ, జి.శ్రీనివాస్, పి.తిరుమల, బి.నవీన్, ఎం.హైమావతి పాల్గొన్నారు.