విద్యార్థులకు అవగాహన సదస్సు
10-04-2026 06:39 PM
లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నాగార్జున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల భద్రతపై శనివారం పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు షీ టీం పోలీసులు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.




