23-04-2025 12:04:30 AM
అర్మూర్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : చెరువులో పడిన గేదెను కాపడబోయి చేపల వలకు చిక్కుకొని ఒకరు మృతి చెందినట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన ముద్దంగుల రమేష్ అనే వ్యక్తి అంకాపూర్ గ్రామ శివారు లోని గుండ్ల చెరువు దగ్గర గేదెలను మేపుతున్నాడు.
చెరువులో పడిన బర్రెను కాపాడే ప్రయత్నంలో అతను చెరువులో దిగగా చెరువు నీటిలోని చేపల వల తట్టుకొని ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లు ఆయన తెలిపారు. మృతుడి భార్య అపర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.