05-06-2025 08:39:44 AM
మసాయి పెట్/చేగుంట, విజయక్రాంతి: మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన గంగపుత్ర జోగు బాబు ( 30 )అనే వ్యక్తి కొప్పులపల్లి డ్యాం లో చాపల షికారుకు వెళ్లి వల చిక్కుకొని మృతి చెందిన సంఘటన, మెదక్ జిల్లా కొప్పులపల్లి డ్యాం(Koppulapally Dam)లో జరిగింది వివరాల్లోకి వెళితే తూప్రాన్ గ్రామానికి చెందిన బాబు, తండ్రి సత్తయ్య వయసు 30 అతనికి ఒక కొడుకు భార్య ఉన్నారు రోజులాగే చాపల షికార్ కు వెళ్లి మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేగుంట ఎస్సై శ్రీ చైతన్ కుమార్ రెడ్డి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.