calender_icon.png 6 June, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో ఘోర ప్రమాదం

05-06-2025 08:36:32 AM

విద్యుత్ స్తంభం ను ఢీ కొట్టి బడి గోడ ఎక్కిన కారు

 తెల్లవారుజామున  ఘటన

గోదావరిఖని,(విజయక్రాంతి): గోదావరిఖని(Godavarikhani) పరశురాం నగర్ బోర్డు నుంచి తిలక్ నగర్ కు వెళ్లే మార్గమధ్యంలో భారత్ యూత్ పక్కన గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో అతి వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ఆ పక్కనే గల ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ పైకి ఎక్కింది. కారులో ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలిసింది. తీవ్ర గాయాలతో ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు  స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందోనని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.