16 April, 2026 | 12:12 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

21-04-2025 06:48 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారి పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్ (51) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. సోమవారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వాడని ఆదివారం మధ్యాహ్నం మృతుడు తన పురోహితం పని ముగించుకొని వెంకట్రావుపేటకు బైక్ పై వెళ్తుండగా వెనకాల నుండి బెలినో కార్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు జాహ్నవి పిర్యాదు మేరకు వాహన డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.