1 July, 2026 | 8:00 PM

Breaking News

సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •  

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

21-04-2025 06:48 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారి పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్ (51) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. సోమవారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వాడని ఆదివారం మధ్యాహ్నం మృతుడు తన పురోహితం పని ముగించుకొని వెంకట్రావుపేటకు బైక్ పై వెళ్తుండగా వెనకాల నుండి బెలినో కార్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు జాహ్నవి పిర్యాదు మేరకు వాహన డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.