28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

10 ఫలితాల్లో మానుకోట ప్రతి ఏటా అగ్రస్థానంలో నిలపాలి

10-05-2025 01:16 AM

ఎమ్మెల్యే మురళీ నాయక్

మహబూబాబాద్, మే 9 (విజయ క్రాంతి): పదో తరగతి ఫలితాల్లో ప్రతి ఏటా మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపే విధంగా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కోరారు. ఈ ఏడాది పది ఫలితాల్లో మహబూబబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవడం పట్ల ఎమ్మెల్యే మురళీ నాయక్ హర్షం వ్యక్తం చేసారు.

స్థానిక క్యాంప్ కార్యాలయంలో డిఇఓ డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, ఇతర జిల్లా విద్యాశాఖ విభాగాల అధికారులు అప్పారావు, మందుల శ్రీరాములు, మహబూబాబాద్ నియోజక వర్గ పరిధిలోని మండల విద్యాధికారులు వెంకటేశ్వరరావు, రాందాస్, యాదగిరి తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు పది ఫలితాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 99.29 శాతంతో జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు అధికారులను అభినందించారు.

ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తి ని కొనసాగించే విధంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని, ప్రభుత్వం పేద విద్యార్థుల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.