23-12-2025 02:13:01 PM
మల్కన్గిరి: మావోయిస్టు పార్టీకి(Maoist Party) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో(Malkangiri district) మంగళవారం ఇరవై రెండు మంది మావోయిస్టులు(Maoists surrender) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒడిశా డీజీపీ వై. బి. ఖురానియా, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులు తొమ్మిది తుపాకులు, 150 సజీవ తూటాలు, 20 కిలోల పేలుడు పదార్థాలు, 13 ఐఈడీలు, జిలెటిన్ స్టిక్లు, ఇతర వస్తువులను అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఎక్కువ మంది పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్కు చెందినవారే అయినప్పటికీ, వారు ఒడిశాలో కార్యకలాపాలు నిర్వహించేవారని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 19 మంది ఒడిశాకు చెందిన వారున్నారు. అందులో ఇద్దరు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వారని అధికారులు వెల్లడించారు.