3 July, 2026 | 9:53 PM

Breaking News

ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •  

జువాలజీ లెక్చరర్‌గా మరియం ఫాతిమా

22-04-2025 12:00 AM

జగిత్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన జూనియర్ లెక్చరర్ల ఎంపికలో జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రానికి చెందిన మరియం ఫాతిమా జువాలజీ సబ్జెక్టు లెక్చరర్గా ఎంపికయ్యారు. పోస్టింగుల్లో భాగంగా మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల జువాలజీ విభాగం లెక్చరర్గా ఆమెకు ప్రభుత్వ ఉత్తర్వులు అందాయి.

ఈ మేరకు మంచిర్యాల ప్రభుత్వ కళాశాలలో జేయల్గా ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. కోరుట్లకు చెందిన మరియం ఫాతిమా తల్లిదండ్రులు ఎం.ఏ.బారి, సెలిన్ బారీ ఇరువురూ కేరళ హై స్కూల్ విద్యా సంస్థ నడుపుతున్నారు. కాగా బాల్యం నుండి పట్టుదలతో చదివి, ప్రభుత్వ లెక్చరర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరియం ఫాతిమాను కోరుట్ల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారు, పలువురు ప్రముఖులు అభినందించారు.