20 March, 2026 | 10:51 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

బైక్ పై నుంచి పడి వివాహిత మృతి

04-09-2024 02:59 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన మాసాడి సరోజ (45)అనే వివాహిత మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో బైక్ పై నుండి కింద పడి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందింది. సరోజ తన తనయుడు అజయ్ తో కలసి మోటర్ బైక్ పై బోయపల్లి గ్రామ శివారులో గల రైతు వేదిక సదస్సు దగ్గరకు వెళ్లి భూమికి సంబంధించిన జిరాక్స్ కాపీలను అందజేయడానికి  ఇంటి నుంచి బయలుదేరారు.ఈ క్రమంలో  మోటార్ సైకిల్ పై వెళ్తుండగా తన ఇంటికి అతి సమీపంలోని బోయపల్లి అండర్ బ్రిడ్జి  వద్ద ఒక బాలుడు అకస్మాత్తుగా ఎదురు వచ్చాడు.

దీంతో బైక్ నడుపుతున్న అజయ్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో   తల్లి సరోజ  వాహనం పై నుండి కింద పడిపోయారు . గాయపడ్డ  సరోజ ను స్థానికులు గమనించి హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో మంగళవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.మృతురాలి భర్త మాసా డి సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అమెరికాలో చదువుకుంటున్న కూతురికి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. గురువారం ఆమె బోయపల్లికి చేరుకున్నాక అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ మేరకు తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.