calender_icon.png 15 November, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం

15-11-2025 12:27:58 AM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు తేది: 22-10-2025 బుధవారం నుండి తేది: 20-11-2025 గురువారం వరకు సామూహిక కార్తీక దీపోత్సవం కార్యక్రమాలు ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 24 వ  రోజు  భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.   

కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రతి రోజూ సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సుహాసినీల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినీలకు ఆలయ అర్చకులు. ఆలయ ఉద్యోగులు చేతుల మీదుగా వాయనం పసుపు కుంకుమ అక్షింతలు గాజులు స్వామివారి ఫోటోను అందజేయడం జరిగినది. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు గోపన్న రాఘవేందర్, జూనియర్ అసిస్టెంట్ నరాల రాజు రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.