13-06-2025 12:50:29 AM
33 మంది ఐఏఎస్లు.. ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులకు స్థానచలనం
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి 33 మంది ఐఏఎస్ అధికారులను, ముగ్గురు ఐఎఫ్ఎస్ లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా లోకేశ్కుమార్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాశ్, హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన బదిలీ అయ్యారు.