13-06-2025 12:18:45 AM
రాత్రి 12 వరకూ విందులు పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
కామారెడ్డి, జూన్ 12,(విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లాలో దాబాల్లో మద్యం సిట్టింగులు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రోడ్లపై ఉన్న దాబాలతో పాటు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దాబా హోటలలో అక్రమంగా మద్యం నిలువలు ఉంచి మందు ప్రియులకు కావలసిన మందులు మటన్ చికెన్ ముక్కలను అందిస్తున్నారు.
దాబాలో మధ్య నిషేధం అమలు చేయాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెచ్చరించినప్పటికీ చాలా ప్రాంతా ల్లో సాయంత్రం ఐదు నుంచి రాత్రి 12:00 వరకు విందులు వినోదాలకు మద్యం అందిస్తూ దావతులు చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం తో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, భిక్కనూర్, దోమకొండ ,బీబీపేట, సదాశివ నగర్ తదితర మండల కేంద్రాల్లో, ప్రాంతాల్లో దాబాల్లో మటన్, చికెన్తో, పాటు మందు కూడా అందుబాటులో ఉండడంతో మద్యం ప్రియులు దాబా హోటల్ లోకి చేరి మద్యo సేవిస్తున్నారు.
దాబా హోటల్ లో తినే ఆహార పదార్థాలు తప్ప మద్యం విక్రయాలు చేపట్టవద్దని పోలీస్ శాఖ ధాబా యజ మానులకు సూచించిన అవి నామమాత్రంగానే అమలుచేస్తూ గుట్టు చప్పుడు కాకుండా దాబాకు కొద్ది దూరంలో మద్యం నిల్వ ఉంచి ఫ్రిజ్జులు, కూలర్లు భద్రపరుస్తున్నారు దాబా హోటల్లో భోజనానికి వచ్చిన వారు మందు బ్రాండ్లకు ఆర్డర్ ఇవ్వగానే దాన్ని తీసుకొచ్చి కస్టమర్లకు అందించడంతో దాబా హోటల్లో సెట్టింగ్ జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసుల తనిఖీలు శూన్యం
దాబాల్లో మద్యం సేవించడం వల్ల శాంతిభద్రతలకు కూడా విఘాతం కలుగుతుంది గొడవలు జరగడం అల్లర్లు చేయడం రోళ్లపై గచ్చి హంగామా సృష్టించడం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాల గురి కావడం వంటివి ప్రతినిత్యం జరగడంతో పోలీసులు దాబా హోటల్లో మందు విక్రయాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టి మద్యం సెట్టింగులు నిర్వహిస్తున్న దాబాలపై దాడులు చేసి ప్రమాదాలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సిట్టింగ్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం
కామారెడ్డి జిల్లాలో దాబాలో మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం వస్తే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు. జిల్లాలో నీ దాబాల్లో జోరుగా మద్యం సిట్టింగులు కొనసాగుతున్నాయని వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని తెలిపారు. మద్యం సిట్టింగులు కొనసాగుతూ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర