మేడే పోస్టర్ ఆవిష్కరణ

26-04-2024 01:40:44 AM

మేడ్చల్, ఏప్రిల్ 25 (విజయ క్రాం తి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్‌నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేడే పోస్టర్‌ను ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ ఆవిష్కరించారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. 8 గంటల పనిదినాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక 12గంటలు చేసిందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీపీఐ కార్యదర్శి ఉమా మహేశ్, ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్వామి, శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు హరినాథ్ పాల్గొన్నారు.