calender_icon.png 19 June, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు లేకుండా చర్యలు చేపట్టాలి

19-06-2025 01:03:28 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా తక్షణ తాత్కాలిక చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చార్మినార్ జోన్ సం తోష్ నగర్ సర్కిల్‌లోని ముంపు ప్రాంతాలను బుధవారం కమిషనర్ యాకుత్‌పుర ఎమ్మె ల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాం తాల్లో వరద నీటిని పంపింగ్ చేసి వరద ముంపు నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని మెయింటెనెన్స్ సీఈని ఆదేశిం చారు. వరద నీటి ప్రవాహాన్ని నియం త్రించడానికి శాశ్వత చర్యల కోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించా రు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ వెంకన్న, జోనల్ ఎస్‌ఈ మహేశ్వర్‌రెడ్డి, డీసీ మంగతాయారు, సీఈ సహదేవ్ రత్నాకర్, ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాస్, కార్పొరేటర్ వాసిఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.