19-06-2025 01:03:42 AM
యాదాద్రి కాపరుల సంఘ నూతన కమిటీ ఎన్నిక
యాదాద్రి భువనగిరి జూన్ 18 ( విజయ క్రాంతి ) : తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల కులవృత్తి కాపాడుట కోసం జీవో నెంబర్ 559 మరియు 1016 అమలు కోసం గొల్ల కురుమలు పోరాడి సాధించుకోవాలని గొల్ల కురుమల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అయోధ్య యాదవ్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికలను స్థానిక భువనగిరి పట్టణంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయోధ్య యాదవ్, మాజీ ఎంపీపీ నరాల నిర్మల వెంకటేష, సమక్షంలో యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా దేశ బోయిన సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు జల్లి నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా సోము రమేష్ యాదవ్ 15 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయోధ్య యాదవ్ మాట్లాడుతూ గొల్ల కురుమల సంక్షేమం అభివృద్ధి కోసం కలిసికట్టుగా పోరాడి సమస్యలు పరిష్కరించు కోవాలని కోరారు. గత ప్రభుత్వము చేసిన పథకాలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము పునరుద్ధరించి గొల్ల కురుమలను ఆదుకోవాలని అన్నారు.
50 సంవత్సరాలు నిండిన ప్రతి గొల్ల కురుమకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, గొల్ల కురుమలు పిడుగులు అకాల వర్షాలు మృతిచెందితే ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, గొర్రెలకు ప్రభుత్వ ఇన్సూరెన్స్, గొర్రెల మేకలు కుక్కల బెడద నక్కల దాడి పిడుగు పడి చనిపోయిన గొర్రెలకు గొర్రె కాపరులకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ జిల్లాలోని గొల్ల కురుమలను సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి పోరాడాలని, ఎన్ఎల్ఎం స్కీం లో అన్ని బ్యాంకుల కాంసెన్ట్ తో కోటి రూపాయల రుణాలను ఇవ్వాలని ప్రభుత్వ భూములు మేతకు గొల్ల కాపరులకు అనుమతులు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మహిళా నాయకురాలకు మాజీ ఎంపీపీ నరాల నిర్మల వెంకటేష్ ప్రధాన కార్యదర్శి కే జ్యోతి బలరాం, నూతన సభ్యులు లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేశ బోయిన నరసింహ, వీరేష్, ఆనంద్, బాలయ్య, శ్రీశైలం, గౌరయ్య, గణేష్, శ్రీనివాస్ యాదవ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.