calender_icon.png 17 June, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల నిషేధం అమలుకు చర్యలు

17-06-2025 12:01:36 AM

నారాయణపేట.జూన్ 16(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధం అమలుకు పగడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు డి.ఎస్.పి నల్లపు లింగయ్య తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పి మాట్లాడారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

గతంలో నమోదైన గంజాయి కేసులే తప్ప కొత్త కేసులేమి లేవని ఆయన చెప్పారు. తమ పోలీసు శాఖ తో పాటు రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఎక్సైజ్ శాఖ, వైద్య శాఖ అధికారులు నిషేధం అమలుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. తమ శాఖ మాదకద్రవ్యాల నిషేధంపై క్షేత్రస్థాయిలో నిఘా పెట్టామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో మేఘా గాంధీ, కలెక్టరేట్ ఏ వో జయసుధ, సీ సెక్షన్ అధికారులు రాణి దేవి, జి సి డి ఓ నర్మద, డి ఐ ఈ ఓ సుదర్శన్, బిక్షపతి, ఎక్సైజ్ శాఖ అధికారులు,తదితరులుపాల్గొన్నారు.