17-06-2025 12:02:47 AM
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
మహమ్మదాబాద్ జూన్ 16 : భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవా రం మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సద స్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ సమస్యలు లేని గ్రామం లేదని భూ భారతి ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో భూభారతి చట్టం చేసే పనులు ప్రతి ఒక్కరికి మదిలో నిలుస్తాయ ని తెలియజేశారు. భూముల సమస్యల పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరిగే రోజులకు కాలానికి ముగింపు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కే ఎం నారాయణ, కమతం విష్ణువర్ధన్ రెడ్డి, శాంతి రంగ్యా, రామ్ లాల్,ఎమ్మార్వో విద్యాసాగర్ రెడ్డి. ఎంపీడీవో నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.