01-06-2025 06:09:20 PM
జిల్లా ఎస్పీ డి జానకి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లాలోని 18 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలీసు సేవా పతకాలు లభించినట్లు జిల్లా ఎస్పీ డి జానకి(District SP D Janaki) తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ రకాల పోలీసు పతకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా నుండి పతకాలు పొందిన పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి అభినందనలు తెలిపారు.