calender_icon.png 12 February, 2026 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

11-02-2026 03:15:26 AM

తుంగతుర్తి, ఫిబ్రవరి 10: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వాతంత్ర సమరయోధులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పాలవరపు రాములమ్మ లక్ష్మీనరసయ్య, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు విశ్రాంత ఉపాధ్యాయుడు ఓరుగంటి సత్యనారాయణ ల జ్ఞాపకార్థం వారి కుమారులు పాలవరపు సంతోష్, ఓరుగంటి సుభాష్, శ్రీనివాస్ ల సహకారంతో మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలోని విశ్రాంతి ఉపాధ్యాయుల భవనంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్నీ లైన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ రేపాల మదన్మోహన్ ప్రారంభించారు.ఈ శిబిరంలో గుండెకు సంబంధించిన వ్యాధులు, షుగర్, బీపీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిక్ వంటి దీర్ఘకాలిక రోగాల పై ప్రత్యేకంగా సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాదులోని యశోద హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన సూచనలు అందించారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ సభ్యులు వెల్లడించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యువ వికాసం కార్యక్రమా నిర్వహించి విద్యార్థులకు పదవ తరగతి పరీక్షల పై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి గట్టుపల్లి అశోక్ రెడ్డి, రీజియన్ చైర్మన్ కొండ సంతోష్ కుమార్, జోనల్ చైర్మన్ కొండపల్లి లక్ష్మారెడ్డి, లైన్స్ క్లబ్ తుంగతుర్తి మండల ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి,కార్యదర్శి పులుసు వెంకన్న, కోశాధికారి గుండగాని రాము, సంయుక్త కార్యదర్శి ఎనగందుల గిరి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.