20 March, 2026 | 3:49 PM

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య శాఖ అధికారి

20-03-2026 02:28 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య శాఖ అధికారి రవీందర్ గౌడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవల గురించి స్థానిక వైద్యాధికారి రోహిత్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. గర్భిణీలు బాలింతలకు సరైన వైద్య సహాయం అందించాలని ఆయన పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పల్లె దవాఖానాలు, గ్రామాల్లోని ఆరోగ్యప కేంద్రాల్లో తగినన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.