calender_icon.png 31 May, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మసిస్ట్ లేక అవస్థలు

14-05-2025 04:41:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆయుష్ దవఖానలో రెండు నెలలుగా ఫార్మసిస్ట్(Pharmacist) పోస్టు ఖాళీగా ఉండటంతో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇక్కడ ఫార్మాసిస్టుగా నిర్వహించిన ఫణిందర్ గుండెపోటుతో మరణించగా, అప్పటినుండి మూడు నెలలుగా ఫార్మసిస్ట్ లేక క్రింది స్థాయి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు రోగులు తెలిపారు. ప్రతినిత్యం ఈ ఆసుపత్రికి 150 వరకు రోగులు వస్తుండగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ఫార్మసీ లేకపోవడం వల్ల ఇతర ఉద్యోగులు ఆ విధులను నిర్వహించవలసి రావడంతో ఉద్యోగులపై అదనపు భారం పడుతుందని వారు పేర్కొంటున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఆయుష్ వైద్యశాల ఏర్పాటు చేయడంతో ఆయుష్ ఆరోగ్య మందులపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో రోగుల సంఖ్య పెరిగినప్పటికీ దవకాలలో సేవలు అందించే సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణ స్పందించి జిల్లా కేంద్రంలో ఫార్మసిస్టును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.