calender_icon.png 1 November, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

31-10-2025 11:05:37 PM

ఏరియా జిఎం దుర్గం రామచందర్ 

మణుగూరు,(విజయక్రాంతి): సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏరియా  సింగరేణి సంస్థ ఆధ్వర్యం లో నవంబర్ 9న  మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా జిఎం దుర్గం రామచందర్ శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 100 ప్రైవేటు సంస్థల లో వివిధ విభాగాల్లో 3 వేల ఖాళీలు భర్తీ కోసం ఎంపిక జరుగుతుందన్నారు . నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు 

చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటోందని, ఈ నేపథ్యంలో పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని నిరుద్యోగ యువత సద్విని యోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. సింగరేణి సంస్థ లో ఉద్యోగ నియామకాల తో పాటు, నిరుద్యోగ యువత అందరికీ ఏదో ఒక ఉపాధి లేదా ఉద్యోగం కల్పించడం కోసం ఈ తరహా కార్యక్రమాలను సింగరేణి సంస్థ స్వచ్ఛందంగా చేపడు తుందని , ఈ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతలో నైపుణ్యాలు పెంచడమే కాకుండా వారికి ఉద్యోగ అవకా శాలను కల్పించేందుకు వీలుగా జాబ్ మేళాలను కూడా ఏర్పాటు చేయిస్తున్నట్లు వివరించారు.