02-06-2025 04:31:13 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం విద్యా వనరుల కేంద్రంలో 2025- 26 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను సోమవారం మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభానికి ముందుగానే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేరవేయాలని ఉద్దేశంతో ముందుగానే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫామ్ లను పంపించడం జరుగుతుందన్నారు.
యూనిఫారాలు ఇప్పటివరకు 80% కుట్టడం పూర్తయిందన్నారు. మండలానికి మొదటి పార్ట్ పాఠ్యపుస్తకాలు 86% రావడం జరిగిందని ఆయన తెలిపారు. పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలను కూడా ప్రభుత్వం పంపించేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి. నిజాంసాగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు సీఆర్పీబీ శ్రీధర్ కుమార్, ఎం.వరలక్ష్మి, పీ.నర్సింలు ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ అనిల్, ఐఇఆర్పిలు గైని చిన్న సాయిలు, సునీల్ కుమార్, మెసెంజర్ పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.