calender_icon.png 19 June, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీవాడ ప్రైమరీ పాఠశాలలో ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈఓ

19-06-2025 04:56:03 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎస్సీ వాడ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో గురువారం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు(MRO Nageswara Rao) చేతుల మీదుగా ఏకరూప దృశ్యాలు నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూల్కు హాజరై ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు.

అనంతరం మిడ్ డే మీల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించడం పట్ల హెచ్ఎం సాయిరాం మహాదేవ్ సార్ ను అభినందించడం జరిగింది. స్థానిక నాయకులు దేవేందర్ రెడ్డి స్టాఫ్ కొరత ఉందని అడిగిన వెంటనే ఒక టీచర్ను డిప్యూటేషన్ పైఈ స్కూల్కు రెండు మూడు రోజుల్లో పంపిస్తానని ఎంఈఓ హామీ ఇవ్వడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ విషయంలో తాను ఎల్లవేళలా అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీపార్టీ మండల సీనియర్ నాయకులు శ్రీ పెద్ద పట్లోళ్లదేవేందర్ రెడ్డి గారు బాన్సువాడ మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు బోర్లం ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సాయిరాం మహాదేవ్ సార్ బొర్లం మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీ మన్నె విట్టల్ బోర్లంమజీద్ కమిటీ మాజీ సదర్ షేక్ మహబూబ్ మాజీ వార్డ్ మెంబర్ ఎర్రోళ్ల సాయిలుమాజీ వార్డు సభ్యులు మన్నే నాగభూషణం మరో వార్డు సభ్యులు ఎర్రోళ్ల బాలు ఎస్ఎంసి చైర్మన్ మన్నే నగవ్వ సూకురు అశోక్ పోతరాజు లింగం, మన్నేబాగయ్య తల్లిదండ్రులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.