03-05-2025 12:20:01 AM
రాజేంద్రనగర్, మే 2: జనగణనతో పాటు కులగణనను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి బీజేపీ నేతలు శుక్రవారం అత్తాపూర్ లో పాలాభిషేకం చేశారు.
పార్టీ డివిజన్ అధ్యక్షులు సుల్గే వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రతాప్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా సెక్రెటరీ కొమురయ్య, రాచూరి రాజశేఖర్, జయానంద్ రెడ్డి, కిరణ్, విజయ్ కుమార్, నల్లింగ్ రమేష్, జి రాజు, శ్రీనివాస్ రెడ్డి, ఆర్ జగన్, పి వెంకట్ రెడ్డి, శశికాంత్ శర్మ, అనురాధ, ఉమా, స్వప్న, శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.