21-11-2025 12:00:00 AM
సంగారెడ్డి కోహీర్లో 7.4 డిగ్రీలు నమోదు
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు నమోదవుతాయని తెలిపింది. గురువారం సంగారెడ్డి కోహీర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీలు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.