29-06-2025 12:57:01 AM
మెట్పల్లి మండలం అరపేట్లో ఘటన
జగిత్యాల, జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరి గిన పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నా రు.
రాత్రి తిరుగు ప్రయాణంలో మెట్పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి అడ్లూరి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రా లు ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, నాయకులు ఊపి రి పీల్చుకున్నారు. మరో వాహనంలో మం త్రి లక్ష్మణ్ కుమార్ వెళ్లిపోయారు.