6 July, 2026 | 4:06 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

వన మహోత్సవాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకుపోవాలి

07-07-2025 10:39 AM

హైదరాబాద్: జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) తెలిపారు. చెట్లు నాటి వాటిని రక్షిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని చెప్పారు. మనం చెట్లు నాటితే మన తర్వాత తరాలకు కూడా ఉపయోగం ఉంటుందని కొండా సురేఖ వెల్లడించారు. వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. నేటి నుంచి తెలంగాణ వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.