07-07-2025 11:24:40 AM
హైదరాబాద్: అశ్వరావుపేట-దమ్మపేట(Aswaraopeta-Dammapeta) మండాల సరిహద్దుల్లో గంజాయి పట్టుబడింది. పంటకాలువలో పామాయిల్ ఆకులు వేసి దాచిపెట్టిన గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వర్షం కురవడంతో ఆకులు కొట్టుకుపోయి గంజాయి ప్యాకెట్లు బయట పడ్డాయి. 80 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్ని విచారిస్తున్నారు.