calender_icon.png 8 August, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ముఖంలో నవ్వు చూడటమే కాంగ్రెస్ లక్ష్యం

08-08-2025 01:49:09 PM

హైదరాబాద్: హనుమకొండ బాల సముద్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ(Double Bedroom) చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్(Minister Ponguleti Srinivas Reddy) పాల్గొన్నారు. ఏడేళ్ల క్రితం నిర్మించిన 592 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామన్నారు. ఏ పార్టీ కార్యకర్త అని కూడా చూడకుండా అబ్ధిదారులను ఎంపిక చేశామని వివరించారు. పార్టీలకు అతీతంగా పేదవాడైతే చాలు.. ఇళ్లు ఇవ్వాలని అధికారులకు చెప్పామని వెల్లడించారు. పేదల ముఖంలో నవ్వు చూడటమే కాంగ్రెస్ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రెండు పడక గదులను పార్టీ కార్యకర్తలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు.

మొదటి విడతలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఎవరికీ రేషన్ కార్డులు(Ration cards) ఇవ్వలేదన్న మంత్రి పొంగులేటి ఈ ప్రభుత్వం  6.50 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చిందని స్పష్టం చేశారు. రేషన్ కార్డులో భార్య పేరు, పిల్లల పేర్లు చేర్చే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతుభరోసా కింద రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లను జమచేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మూడేళ్లకే కూలిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను విచారణ కమిషన్ బయటపెట్టిందని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్‌లను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను కేంద్రంలోని బీజేపీ ఆమోదించలేదని వివరించారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.