30-05-2025 12:07:17 AM
మణుగూరు మే 29 (విజయ క్రాంతి)మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రి లో స్త్రీ, పురు ష వార్డులలో ఉన్న బెడ్స్ లలో చాలా వరకు పరుపులు దెబ్బతిన్నాయని, వాటి వల్ల హాస్పిటల్ వైద్య చికిత్స పొందే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దెబ్బ తిన్న పరుపులను తొలగించి కొత్త పరుపులు వేయించాలని కోరుతూ ఏరియా యాక్టింగ్ జి యం లక్ష్మీ పతి గౌడ్ కు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రాన్ని అందజేశారు.
ఏరియా ప్రగతి కోసం కష్టించి పని చేస్తున్న కార్మికుల వారి కుటుంబ సభ్యుల అరోగ్య పరిరక్షణే ధ్యేయంగా స్థానిక యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమన్నారు. కోవిడ్ కాలంలో బెడ్స్ పై వేసిన పరుపులు ఎన్ని సార్లు మరమత్తులు నిర్వహించిన వాడుకలో మాత్రం రోగులకు ఉపయోగ పడే విధంగా ఉండటం లేదని దాని వల్ల స్త్రీ, పురుష వార్డులలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటి నాయకులు బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు ఫిట్ సెక్రటరీ లు ఇమ్రాన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.