17 March, 2026 | 1:42 PM

Breaking News

బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్   •   గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు   •   కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు   •   కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •  

పత్తి సేకరణపై మంత్రి తుమ్మల సమీక్ష

07-11-2024 03:55 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో పత్తి సేకరణపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రోజువారీ పత్తి సరకు వివరాలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. సీసీఐ కుంద్రాల్లో పత్తిని విక్రయించాలని రైతులకు సూచనలు చేశారు. సీసీఐ నిర్ణయించిన ప్రమాణాలు పాటించాలన్నారు. రైతులందరూ తమ పత్తి పంటను ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని మంత్రి సూచించారు. మార్కెటిగ్ శాఖ అధికారులు తీసుకొచ్చిన వాట్సప్ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని, గరిష్ఠ మద్దతు ధర పంటను విక్రయించాలని మంత్రి తుమ్మల చెప్పారు.