20-06-2025 07:14:25 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తిప్పర్తి ఎస్సైగా వి. శంకర్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన ఎస్సై సాయి ప్రశాంత్ హలియా ఎస్సైగా బదిలీ అయ్యారు. 2011 బ్యాచ్ కు చెందిన ఎస్సై శంకర్ గతంలో సిద్దిపేట, నకిరేకల్, నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ప్రజల ఫిర్యాదులపై త్వరితగతిన స్పందిస్తూ, న్యాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించకుండా చూసేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. పౌరులతో సమన్వయం పెంచుకుని మండలాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.