22 June, 2026 | 1:42 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి

22-06-2026 12:36 PM

తెలంగాణ బిడ్డ ఒలింపిక్స్ స్థాయికి ఎదిగే విధంగా కార్యాచరణ

క్రీడల కోసం పాలమూరుకు మరో రూ. 100 కోట్లు

మహబూబ్ నగర్: తెలంగాణ బిడ్డ ఒలింపిక్స్ స్థాయికి ఎదిగే విధంగా కార్యాచరణ చేపట్టామని మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వాకిటి శ్రీహరి పర్యటించారు. 400 మీటర్లు, 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్(Synthetic athletic track) ఏర్పాటుకు మంత్రి వాకిటి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మహబూబ్ నగర్ స్టేడియానికి రూ. 12 కోట్లు మంజురయ్యాయని తెలిపారు. యువత అవకాశాలను వినియోగించుకుని పాలమూరు గడ్డకు పేరు తేవాలని సూచించారు. ఆటతోనే ప్రపంచానికి చూపించాలనుకున్న వారికే ఆట వస్తుందని వివరించారు.

మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఉన్నందుకు జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలిపారు. క్రీడల కోసం మరో రూ. 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. విద్యార్థులను ఏ స్థాయిలోనైనా ఆడించే శక్తి పాలమూరు జిల్లాకు వచ్చిందన్నారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై గ్రీన్ ఛానెల్ లో రెవెన్యూ స్థలాలు క్లియర్ చేసి కలెక్టర్లకు ఇవ్వాలని ఆదేశించారు.