హైదరాబాద్: గత మూడు వారాలుగా అత్యంత ఆసక్తితో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల గ్రాండ్ ఫినాలేకు ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ పూర్తిగా సిద్ధమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్(Hitex Exhibition Center) కన్వెన్షన్ కేంద్రంలో శనివారం మిస్ వరల్డ్ ఫినాలే(Miss World Finale) కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం 6 నుంచి రాత్రి ఒంటిగంట వరకు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచవ్యాప్త కార్యక్రమానికి నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez), ఇషాన్ ఖట్టర్ వంటి బాలీవుడ్ తారలు, ఇతర ప్రముఖ నటులు, ముగింపు సందర్భంగా నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫినాలేలో 2017 విస్ వరల్డ్ మానుషీ చిల్లర్ సందడి చేయనున్నారు.
మిస్ వరల్డ్ పోటీల్లో(Miss World pageants) మొత్తం 108 దేశాల అందగత్తెలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేత ప్యానెల్లో ప్రశంసలు పొందిన నటుడు సోను సూద్, మేఘ ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి, మిస్ వరల్డ్ 2017 టైటిల్ హోల్డర్ మానుషి చిల్లార్ ఉంటారు. ఆయన మానవతావాద సహకారాలకు గుర్తింపుగా, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం సోను సూద్కు వార్షిక మానవతావాద అవార్డును ప్రదానం చేస్తుంది. మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ(Julia Morley) మిస్ వరల్డ్ జడ్డిల ప్యానెల్ హెడ్ గా ఉన్నారు.
ఇప్పటికే పలు పోటీల్లో సత్తా చాటి 16 మంది అభ్యర్థులు క్వార్టర్స్ కు ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ బృందం మిగిలిన వారిని ఫైనల్స్ రోజే ప్రకటించనుంది. ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విభాగానికి ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరు ఎంపిక కానున్నారు. గురువారం రాత్రి, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ రెండు రోజుల ముందు నిర్వహించిన "మల్టీమీడియా ఛాలెంజ్" విజేతలను కూడా ప్రకటించింది. నాలుగు వేర్వేరు ఖండాలకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు పోటీదారులు ఈ ఛాలెంజ్లో విజయం సాధించారు. ఆసియా-ఓషియానియా నుండి థాయిలాండ్, యూరప్ నుండి మోంటెనెగ్రో, ఆఫ్రికా నుండి కామెరూన్, అమెరికా-కరేబియన్ ప్రాంతం నుండి డొమినికన్ రిపబ్లిక్. వారి విజయాలు చివరి రౌండ్కు టాప్ 40 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఫైనల్ ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ, మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకుంటారనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.