14 August, 2026 | 9:59 PM

Breaking News

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •   13వ వార్డులో కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి - కౌన్సిలర్ సువార్త   •   స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాలూర చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు   •  

చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

14-08-2026 07:47 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చందూరు మండలంలోని మేడిపల్లి తండా, లక్ష్మీ సాగర్ తండా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన తన చేతుల మీదుగా ప్రారంభించారు.మేడిపల్లి గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం మేడిపల్లి నుంచి లక్ష్మీ సాగర్ వరకు SDF నిధులు రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే లక్ష్మీ సాగర్ నుంచి వ్యవసాయ పంట పొలాలకు వెళ్లేందుకు SDF నిధులు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్డు, లో లెవెల్ వంతెనను కూడా ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు.